వినాయక చవితి పూజా విధానము-కథ- మంగళహారతులు-దండకము

 
కడలి ఆధ్యాత్మికం
వినాయకుని ప్రార్ధనలు ఇన్నీ అన్నీ అని చెప్పజాలము. ప్రతి పనికీ, రచనకూ ముందు వినాయకున్ని ప్రార్థించడం ఆనవాయితీ గనుక దాదాపు ఎన్ని పద్యకావ్యాలున్నాయో అన్ని ప్రార్ధనా కీర్తనలు ఉన్నాయి. ఇక సంప్రదాయక శ్లోకాలు సరేసరి. మరి భాద్రపద శుక్ల పక్ష వినాయక చవితి నాడు వినాయక పూజ ఏ క్రమంలో ఎలా చేయాలో తెలుసుకుందాం.
గమనిక: పూజ ముగిసిన తరువాత తప్పక వినాయక చరిత్రను, పూర్తిగా చదవాలి అప్పుడే వినాయకుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది.
శ్రీ వినాయక పూజకు కావాల్సిన సామాగ్రి:

దీపారాధనకు దీపాలు / ప్రమిదలు - 2

గంట - 1
హారతి ప్లేట్ - 1
ఆచమనం చేయడానికి పంచపాత్ర, ఉద్ధరణి, చిన్న పళ్లెం,
నూనె లేదా ఆవు నెయ్యి
అగర్భత్తులు/ సాంబ్రాణి - 1 ప్యాకెట్
అగ్గిపెట్టె
చిన్న పీట లేదా ఆసనం - 1
ఒక పాత్రం లో నీరు పూజ చేసే వారు ఆచమనం చేయడానికి
పసుపు 25గ్రా.
కుంకుమ 25 గ్రా.
పసుపు గణపతి- మట్టితో చేసిన గణపతి పూజకు శ్రేష్టం1/2 kg
తమలపాకులు
అగరవత్తులు 1 పేకట్
ప్రత్తి (ఒత్తులకు, వస్త్రయుగ్యమునకు, యజ్ఞోపవీతమునకు)
పంచామృతములు (ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు)
గంధము
వక్కలు
హారతి కర్పూరం
పూలు(అష్టోత్తరనామావళి కొరకు విడి పూలు మరియు వినాయక విగ్రహం లేదా పటానికి పూల మాల)
అరటి పండ్లు
కొబ్బరికాయలు
 21 రకాల పత్రి (మాచి పత్రం, బృహతీ పత్రం, బిల్వ పత్రం, దూర్వాయుగ్మం పత్రం, దత్తూర పత్రం, బదరీ పత్రం, ఆపామార్గ పత్రం, తులసీ పత్రం, చూత పత్రం, కరవీర పత్రం, విష్ణుక్రాంత పత్రం, దాడిమీ పత్రం, దేవదారు పత్రం, మరువక పత్రం, సింధువార పత్రం, జాజి పత్రం, గండలీ పత్రం, శమీ పత్రం. అర్జున పత్రం, అర్మ పత్రం మరియు అశ్వత్థ పత్రం)
నైవేద్యాలు (బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు)


గమనిక:
కొంత ప్రయత్నిస్తే ఈ పత్రాలు అన్నీ సులభంగా లభిస్తాయి. ఒకవేళ అన్ని పత్రాలు దొరకకపోతే, లేని వాటికి బదులుగా ఈ 21 పాత్రలలోనే ఏవైతే ఎక్కువగా లభిస్తాయో వాటిని లేదా గరికను వినాయకుడికి సమర్పించవచ్చు. గణపతికి ఇష్టమైన ఈ 21 పత్రాల వెనుక ఔషధ గుణాలు, ఆరోగ్య రహస్యాలు వున్నది కనుక వీటికి బదులుగా వేరే పత్రాలను సమర్పించకూడదు.

పూజకు ముందుగా సిద్ధం చేసుకోవాల్సినవి:

వినాయక చవితి రోజున ప్రాతః కాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి.
మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి.
పసుపు గణపతి వినాయక చవితి రోజున వినాయక విగ్రహం మరియు పటం ఉన్నప్పటికీ ముందుగా పసుపుతో. చేసిన గణపతిని పూజించవలెను. పసుపుతో చేసిన గణపతికి కుంకును పెట్టి తమలపాకు పై ఉంచాలి. చిన్న పళ్లెములో లేదా అరిటాకుపై బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపుతో చేసిన గణపతిని తమలపాకుతో పాటు ఉంచాలి.
 స్వామి వారిని ఈశాన్య భాగంలో ప్రతిష్టించాలి.
కొబ్బరి నూనె లేదా ఆవు నేతితో దీపము వెలిగించండి.
గణపతి విగ్రహాన్ని/ వినాయక పటాన్ని పూల మాలలతో అలంకరించుకోవాలి.
 నైవేద్యాలను తయారు చేసి పల్లాలలో లేదా అరటి ఆకుల పై ఉంచి వినాయకుని ముందు ఉంచాలి. పూజ ముగిసిన తరువాత నైవేద్యాన్ని నీటిని చల్లి శుద్ధి చేసి సమర్పించాలి.
 అలా అన్నింటినీ సిద్ధం చేసుకున్న తరువాత ఈ క్రిం శ్లోకంతో పూజకు ముందు మనం చేయాల్సిన శారీరక శుద్ధి మరియు సంకల్పం చెప్పి పూజను ప్రారంభించాలి.

పూజకు ముందుగా చేయవలసిన కొన్ని పనులు:

వినాయక చవితినాడు తెల్లవారుజామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని ఇంట్లో అందరూ తలస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి. దేవుడి గదిలో లేదా ఈశాన్యమూల స్థలాన్ని లేదా వీలుగా ఉండే తూర్పు/ఉత్తర దిశలలో శుద్ధిచేయాలి. బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు పెట్టి, దేవుణ్ణి ఉంచడానికి ఒక పీట వేయాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, ముగ్గును వేయాలి. పాలవెల్లిని పండ్లతో అలంకరించి దానికింద ఉంచిన పీటపై గణపతి విగ్రహాన్ని ఉంచాలి.

పూజచేసేవారు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కూర్చునేందుకు మరోపీట లేదా ఒక ఆసనమును వేసుకోవాలి. పూజ చేసుకొనే మగవారు పంచె/దోతీను కట్టుకోవడం శ్రేష్టం. తదుపరి ఒక తాంబూలం మూడు ఆకులు (తమలపాకు కొసలు చేతివేళ్ల చివరలను తాకాలి), రెండు వక్కలు, రెండు పళ్లు, చిల్లరి పైసలు పెట్టి పట్టుకోవాలి.

తర్వాత కింది శ్లోకములను చదువుకోవాలి…

శ్లోకం: (రెండు చేతులను జోడించి భగవంతుణ్ణి ఈ శ్లోకం ద్వారా విజ్ఞాలు లేకుండా పూజ పూర్తి కావాలని ప్రార్థించవలెను)
"శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతాయే"
ఆచమనం:
పూజను ప్రారంభించే ముందు ఆచమనం చేయాలి. అనగా మొదట నీటితో చేతులను శుభ్రం చేసుకొని తరువాత..
'గోకరణం చేతి' ముద్రతో నీటిని మూడు సార్లు త్రాగాలి, ఆచమనానికి చేతిలో తీసుకునే నీటి మొత్తం బఠానీ పరిమాణం అంత మాత్రమే ఉండాలి. మంత్రం చెప్పే ప్రతి సారి చేతిలోని నీటిని త్రాగాలి.
"ఓం అచ్చుతాయ నమః"
"ఓం అనంతాయి నమ:"
"ఓం గోవిందాయ నమః"
ఆ తరువాత మన చేతి వేళ్లతోటి మన దేహంలోని పన్నెండు స్థానాలను భగవన్నామాలను చెబుతూ స్పృశించాలి. అలా చేయటం వలన శరీరంలోని ఆయా ప్రాంతం భగవంతుని యొక్క శక్తితోటి ప్రభావితం అవుతుంది. దీనిని 'అంగ స్పర్శ' అని అంటారు.
కుడి చెంపను తాకుతూ బొటనవేలు "ఓం కేశవాయ నమహా!"
ఎడమ చెంపను తాకుతూ బొటనవేలు - "ఓం నారాయణాయ నమహా!"
ఉంగరపు వేలు, కుడి కన్ను "ఓం మాధవాయ నమహా!"
ఉంగరపు వేలు, ఎడమ కన్ను "ఓం గోవిందాయ నమహా!"
చూపుడు వేలు, ముక్కు కుడి నాసికా రంధ్రం "ఓం విష్ణవే నమహా!"
చూపుడు వేలు, ముక్కు ఎడమ నాసికా రంద్రం "ఓం మధుసూదనాయ నమహా!"
చిన్న వేలు, కుడి చెవి- "ఓం త్రివిక్రమాయ నమహా!"
చిన్న వేలు, ఎడమ చెవి "ఓం వామనాయ నమహా!"
మధ్య వేలు, కుడి భుజం "ఓం శ్రీధరాయ నమహా:"
మధ్య వేలు, ఎడమ భుజం "ఓం రిషీకేశాయ నమహా!"
నాలుగు వేళ్లు (బొటనవేలు లోపలికి ముడుచుకున్న చేయి). నాభి (నావికాదళం)- "ఓం పద్మనాభాయ నమహా!"
నాలుగు వేళ్లు (బొటనవేలు లోపలికి ముడుచుకున్న చేయి). నుదిటి మధ్య భాగం "ఓం దామోదరాయ నమహా!"


సంకల్పం:
ముందుగా ఎడమ చేతిలో కుడి చేతిని బోర్లించి, కుడి తొడపై రెండు చేతులను ఉంచాలి. దీనినే 'సంకల్ప ముద్ర' అని అంటారు. ఈ ముద్రతో సంకల్పాన్ని చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించాలి.
భారత దేశంలో నివసించు వారికి:
"శ్రీ భగవత్ ఆజ్ఞ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే, శ్రీ మహా విష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ:
ద్వితీయపరార్థే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ దక్షిణాయేనే, వర్షరుతుడు, భద్రపదమాసే, శుక్ల పక్షి, చతుర్థ్యం ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్ విశ్వవసు నామా సంవత్సరము, వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, నామదేయ: ధర్మపత్నీ సమేతోహం సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్థం, శ్రీ వరసిద్ధి వినాయక దేవత క దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీమహాగణాధిపతి పూజాం కరిష్యే"
అంటూ కుడిచేయి ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి.

పసుపు గణపతి పూజ:
పసుపు గణపతికి కుంకుమను అలంకరించి ఒక పుష్పమును సమర్పించాలి. తర్వాత కింది మంత్రాలు చదువుతూ అక్షతలను పసుపు గణపతిమీద వేయాలి.
ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః
ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచీపురంధరాభ్యాం నమః
ఓం అరుంధతీవశిష్ఠాభ్యాం నమః ఓం సీతారామాభ్యాం నమః
సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమోనమః

అయం ముహూర్తః సుముహూర్తోస్తు
తదేవలగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం తదేవ
లక్ష్మీపతేతేంఘ్రియుగం స్మరామి
యశ్శివోనామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయో స్సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళమ్‌
అని చదువుతూ పీటమీద తూర్పుముఖంగా కూర్చోవాలి.
ముందుగా పసుపుతో గణపతిని తయారుచేసి, కుంకుమబొట్టు పెట్టాలి.

ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని,
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా|
యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాఅంతర శ్సుచిః ||
ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః
అనుకుని అనంతరం కుడిచేతి బొటన వ్రేలితో – ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను. 
అనంతరం దీపారాదనను చేయాలి.
శ్లో || ఘ్రుతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం|
దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ||
దీపమును వెలిగించి – గంధ పుష్పాదులతో అలంకరించి – దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి.
భూతోచ్ఛాటన:
అక్షతలు తీసుకోని కింది శ్లోకమును చెబుతూ, భార్య ఎడమచేతి పక్కనుంచి వెనక్కు వేయాలి. మిగతావాళ్లు వారి ఎడమచేతి పక్కనుంచి వెనక్కు వేసుకోవాలి.
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః | ఏతే భూమిభారకాః | ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
ప్రాణాయామః
కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికాపుటములను బంధించి కింది ప్రాణాయామ మంత్రమును చెప్పుకొనవలెను.
ఓం భూః, ఓం భువః , ఓం సువః, ఓం జనః, ఓం తపః , ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధీయోయనః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం.

కలశారాధన:
తదంగ కలశ పూజాం కరిష్యే…
కలశం అంటే ఆచమన పాత్ర కాకుండా నీళ్ళు వుండే మరొక పాత్ర కు గంధము, కుంకుమ అలంకరించి అక్షతలు, పుష్పము వేసి ఎడమ అరచేతితో కింద పట్టుకొని కుడి అరచేతితో పైన పట్టుకుని కింది శ్లోకమును చదవవలెను.

కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః | 
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః ||
కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా |
ఋగ్వేదో యజుర్వేదో స్సామవేదో అధర్వణః ||
అంగై శ్చ సాహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః |
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ ||
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు |
ఆయాంతు శ్రీ మహా గణాధిపతి పూజార్థం దురితక్షయ కారకాః
అని కొంచెం కలశం లోని జలమును తమలపాకుతో (దేవుడి మీద చల్లి ) దేవం (తమ మీద చల్లుకుని) ఆత్మానం, పూజా ద్రవ్యాల మీద చల్లుతూ పూజాద్రవ్యాణిచ సంప్రోక్ష్యా అనవలెను.
విఘ్నేశ్వర పూజ:

గణానాంత్వాం గణపతిగ్ం హవామహే, కవిం కవీనా ముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ్యస్పత్యః ఆనశృణ్వన్నూతిభిస్సీద సాదనం||
శ్రీ మహాగణాధిపతయే నమః ||
ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని మధ్య వేలితో నీటిని తాకాలి.
ధ్యానం :
కింది శ్లోకం చదువుతూ పూవులూ అక్షతలూ కలిపి పసుపు గణపతి పాదాల ముందు ఉంచాలి.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ||
షోడశోపచార పూజ:
1. ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- ధ్యాయామి – ధ్యానం సమర్పయామి. పుష్పమును దేవుడి వద్ద వుంచవలెను
2. శ్రీ మహా గణాధిపతి యై నమః :- ఆవాహయామి – ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి వద్ద వుంచవలెను
3. శ్రీ మహా గణాధిపతి యై నమః :- రత్న సింహాసనం సమర్పయామి- కొన్ని అక్షతలు సమర్పించవలెను
4. ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- పాదయోః పాద్యం సమర్పయామి – పుష్పం తో నీరు దేవుడికి పాదములు కడగాలి – కడిగినట్టు భావించాలి
5. శ్రీ మహా గణాధిపతి యై నమః :- దేవతాయై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి – పుష్పంతో నీరు దేవుడి చేతులు కడగాలి – కడిగినట్టు భావించాలి
6. శ్రీ మహా గణాధిపతి యై నమః :- ముఖే ఆచమనీయం సమర్పయామి – పుష్పంతో నీరు దేవుడికి ముఖం కడుగుటకు ఇవ్వాలి
7. శ్రీ మహా గణాధిపతి యై నమః :- మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి – పుష్పం తో నీరు దేవుడికి మధుపర్క స్నానానికి సమర్పించాలి
8. ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- శుద్ధోదక స్నానం సమర్పయామి – పుష్పం తో నీరు దేవుడికి స్నానం చేస్తున్న భావన చేస్తూ సమర్పించాలి
9. ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- వస్త్ర యుగ్మం సమర్పయామి – వస్త్ర యుగ్మం రూపేణ అక్షతాన్ సమర్పయామి – వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షతలు సమర్పించాలి
10. శ్రీ మహా గణాధిపతి యై నమః :- ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి – కుంకుమ ధారణ చేయాలి
11. ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- యజ్ఞోపవీతం సమర్పయామి – యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి – అక్షతలు వేయాలి
12. ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- శ్రీ గంధాం ధారయామి -గంధం సమర్పించాలి
13. ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- సర్వాభరణాన్ ధారయామి – అక్షతలు సమర్పించాలి
14. ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి – పువ్వులు/ అక్షతలు సమర్పించాలి
15. ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- (యథా శక్తి మన ఇష్ట దైవము యొక్క మంత్ర జపమును, అష్టోత్తర శత నామాన్ని, కాని లేదా ప్రార్థన శ్లోకము ను గాని చదువుకొన వలెను.

ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణాయ నమః,
ఓం లంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం ధూమకేతవే నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచం ద్రాయ నమః,
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః,
ఓం శూర్పక ర్ణాయ నమః,
ఓం హేరంభాయ నమః,
ఓం స్కందపూర్వజాయ నమః,
ఓం గణాధిపతయే నమః.
షోడశ నామ పూజా సమర్పయామి
16. ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- ధూపమాఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించి దేవుడికి/ దేవికి చూపించాలి)
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- దీపం దర్శయామి (దీపం చూపించాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- నైవేద్యం సమర్పయామి (నివేదనార్పణా విధి: నివేదన చేయు పదార్థముల చుట్టూ గాయత్రి మంత్ర స్మరణ చేస్తూ…
ఓం భూర్భువస్సువః తథ్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ (అంటూ కొంచెం జలమును చిలకరించి)
సత్యం త్వర్తేన పరిషం చామి (మూడు సార్లు పుష్పము తో గాని , ఉద్ధరిణి తో గాని అన్నింటి చుట్టూ సవ్య దిశ లో (ఎడమ నుండి కుడి వైపుకు ) తిప్పాలి.

అమృతమస్తు (నైవేద్యం పై జలమును వుంచి) అమృతోపస్తర ణమసి (అదే నీటిని దేవుడి / దేవి వద్ద ) ఉంచాలి.
దిగువ మంత్రము లతో భగవంతునికి ఆరగింపు (తినిపిస్తున్నట్టు – బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేళ్ళ తో) చూపవలెను.

ఓం ప్రాణాయ స్వాహా– ఓం అపానాయ స్వాహా — ఓం వ్యానాయ స్వాహా — ఓం ఉదానాయ స్వాహా — ఓం సమానాయ స్వాహా –ఓం పరబ్రహ్మణే నమః — అంటూ నివేదించవలెను.
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- తాంబూలం సమర్పయామి – తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి.(తాంబూలం చూపించుట కానీ, అక్షతలు గాని సమర్పించాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి (కర్పూర హారతి ఇవ్వాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- మంత్ర పుష్పం సమర్పయామి (అక్షతలు, పువ్వులు సమర్పించవలెను).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- నమస్కారం సమర్పయామి (ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను)
శ్రీ మహాగణాధిపతి స్సుప్రసన్నో, సుప్రీతో, వరదోభవతు || శ్రీ గణాధిపతి ప్రసాదం శిరసాగృహ్ణామి అంటూ పూజ చేసిన అక్షతలు రెండు తీసుకొని తలపై వుంచుకోవాలి.
మరలా ఆచమానం చేసి పైన చెప్పుకొన్న విధంగానే మరలా సంకల్పం చెప్పుకోవాలి.

శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠ:


విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి
ఓం ఆంహ్రీంక్రోం యంరంలంవం శంషంసంహం – ఇత్యాద్యేన ప్రాణప్రతిష్ఠాపనం కృత్వా, నమస్కృత్వా (నమస్కారం చేస్తూ) ||ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం
తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు||
అవాహితోభవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ, వరదోభవ, ప్రసీద, ప్రసీద, ప్రసీద (అంటూ వినాయకుడి విగ్రహం పాదాల వద్ద అక్షతలు లేక పూలు వేయాలి)
షోడశోపచార పూజ:
ధ్యానం:
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ధ్యాయే త్సిద్ధి వినాయకమ్ ||
శ్రీ గణాధిపతయే నమః ధ్యాయామి||
వినాయకుడి విగ్రహం పాదాల వద్ద పూలు, అక్షతలు వేసి నమస్కరించాలి
ఆవాహనమ:
అత్రాగచ్ఛ జగద్వన్ద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ.
ఆవాహయామి|| అని మరల అక్షతలు వేయాలి
సింహాసనం:
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
ఆసనం సమర్పయామి || అక్షతలు లేదా పూలు వేయాలి
అర్ఘ్యం:
గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గన్ధపుష్పాక్షతైర్యుతమ్
అర్ఘ్యం సమర్పయామి||ఉద్ధరెణతో నీరును స్వామికి చూపించి పక్కన వుంచుకున్న పాత్రలో వేయాలి
పాద్యం:
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
పాద్యం సమర్పయామి|| మరలా కొంచె నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి

ఆచమనీయం:

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత
గృహాణాచమనందేవ తుభ్యందత్తం మయా ప్రభో
ఆచమనీయం సమర్పయామి|| కొంచె నీటిని స్వామికి చూపించి పాత్రలో వేయాలి
మధుపర్కం:
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే
మధుపర్కం సమర్పయామి|| స్వామికి మధుపర్కాన్ని సమర్పించాలి.
పంచామృత స్నానం :
పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత
పంచామృత స్నానం సమర్పయామి|| ఆవుపాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెలు స్వామి విగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్వామిపై చల్లాలి
శుద్ధోదక స్నానం:
గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః
స్నానం కురుష్వభగవన్వుమాపుత్ర నమోస్తుతే
శుద్ధోదక స్నానం సమర్పయామి||కొంచెం నీటిని స్వామిపై చల్లాలి
వస్త్రయుగ్మం:
రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం
శుభప్రద గృహాణత్వం లమ్బోదర హరాత్మజ
వస్త్రయుగ్మం సమర్పయామి|| స్వామికి వస్త్రాలు లేదా ఇంట్లో పూజ చేసుకొనేట్లయితే పత్తికి పసుపు, కుంకుమ రాసి దానిని వస్త్రంగా ఇవ్వవచ్చు
ఉపవీతం:

రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకమ్
గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక
ఉపవీతం సమర్పయామి|| యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి
గంధం:
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
గంధం సమర్పయామి|| కొంచెం గంధాన్ని స్వామికి అలంకరించాలి
అక్షతలు:
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్
శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే
అక్షతాన్ సమర్పయామి|| స్వామికి అక్షతలు సమర్పించాలి
పుష్పములు:
సుగన్ధాని చ పుష్పాణి జాతీకుంద ముఖాని చ
యేకవింశతి పత్రాణి, సంగృహాణ నమోస్తుతే
పుష్పాణి పూజయామి|| స్వామిని పూలతో పూజించాలి
అధాంగపూజ:
కింది నామాలను చదువుతూ పుష్పములతో స్వామి వారిని పూజించవలెను.
గణేశాయ నమః – పాదౌ పూజయామి
ఏకదంతాయ నమః – గుల్ఫౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః – జానునీ పూజయామి
విఘ్నరాజాయ నమః – జంఘే పూజయామి
అఖువాహనాయ నమః – ఊరూ పూజయామి
హేరంబాయ నమః – కటిం పూజయామి
లంబోదరాయ నమః – ఉదరం పూజయామి
గణనాథాయ నమః – నాభిం పూజయామి
గణేశాయ నమః – హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః – కంఠం పూజయామి
గజవక్త్రాయ నమః – వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః – నేత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి
విఘ్నరాజాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి

ఏకవింశతి పత్రపూజ:

21 విధముల పత్రములను ఒక్కొక్క నామం చదువుతూ పక్కన సూచించిన విధంగా పత్రాలు తీసుకుని స్వామిని పూజింపవలెను.

ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి (మాచిపత్రి)
ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి (వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి (గరికె)
ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి (రేగి)
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణు)
ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి (తులసి)
ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి (మామిడి)
ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంతం)
ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి (మరువం)
ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి (వావిలి)
ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి (జాజి)
ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి (గండకీ)
ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి (జమ్మి)
ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి (రావి)
ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి (మద్ది)
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి (తెల్లజిల్లేడు)
ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతపత్రాణి పూజయామి.


శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా:


ఈ క్రింది నామాలు చదువుతూ స్వామిని పూలతోగాని, అక్షతలతో గాని పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి.

ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వ నేత్రే నమః
ఓం నర్వసిద్దిప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణువే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షావిధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

ధూపం:
దశాంగం గుగ్గు లోపేతం సుగన్ధిం సుమనోహరమ్ |
ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ || ధూపమాఘ్రపయామి||
అగరబత్తి వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించి పక్కన వున్న స్టాండులో లేదా అరటి పండుకు గుచ్చాలి.

దీపం
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోతితం మయా
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
దీపం దర్శయామి|| దీపాన్ని స్వామికి చూపించాలి

నైవేద్యం

కొబ్బరి కాయలు ఇంకా వుంటే వాటిని తలా ఒకటి కొట్టి నైవేద్యం పెట్టాలి. అంతకు ముందు స్నానం సమయంలో కొట్టిన బ్బరికాయను, పిండి వంటలు, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు, అరటిపండ్లు మొదలైన వాటిని స్వామి ముందుంచాలి.
సుగంధాన్ సుకృతాం శ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్,
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గ్యైః ప్రకల్పితాన్
భక్ష్యం, భోజ్యంచ లేహ్యం చ చోష్యం పానీయ మేవచ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక- మహానైవేద్యం సమర్పయామి||అంటూ ఆకుతో ఆ పదార్ధారన్నింటిపైన కొద్దిగా నీరు చల్లాలి. ఆ తరువాత స్వామికి నైవైద్యం పెట్టాలి.

తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్ |
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
తాంబూలం సమర్పయామి. తమలపాకులు, వక్క, పండు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుడి విగ్రహం ముందు వుంచి నమస్కరించాలి.

నీరాజనం
సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ,
భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి||
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా
నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ
నీరాజనం సమర్పయామి|| కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇచ్చి, ఆ తరువాత హారతి పాత్రపై కొంచె నీటిని వుంచి కళ్ళకు అద్దుకోవాలి

మంత్రపుష్పం
పుష్పం, అక్షతలు తీసుకొని నిలుచొని ఈ శ్లోకాన్ని పఠించాలి
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపా
ధూమకేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
వక్రతుండః మహాకాయ కోటిశూర్య సమప్రభ
అవిఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా
అక్షతలు, పూలు స్వామి పాదాల వద్ద వుంచాలి

ప్రదక్షిణ:
యానికానిచ పాపాని జన్మాన్తరకృతానిచ|
తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణ పదేపదే ||
పాపో హం పాపకర్మాహం పాపాత్మా పాపసమ్భవః |
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష గణాధిప ||
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ||
ప్రదక్షిణ చేసి నమస్కరించాలి. సాష్టాంగ ప్రణామం చేయడం సంప్రదాయం

తరువాత మరలా కూర్చొని, కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. కొంచె నీటిని అక్షతలపై వేసుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి.

యస్యస్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవన్దే తమచ్యుతమ్!!
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే!!

అనయా ధ్యానమావాహనాది షోడషోపచార పూజయాచ, అష్టోత్తర నామార్చనయాచ, అవసర, మహా నివేదన యాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు అంటూ అక్షతలు, నీటిని పళ్ళెంలో వదలాలి. ఆ నీటిని, పంచామృతాలు, కొబ్బరి నీళ్ళను కలిపి తీర్థంగా తీసుకోవాలి. పూజ చేసిన అక్షతలను పిల్లల శిరస్సుపై వుంచాలి. పెద్దలు కూడా ఆ అక్షతలు శిరసుపై ధరించాలి.

నమస్కారము, ప్రార్థన:

"ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన... ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి" అని చెబుతూ ప్రదక్షిణం చేయాలి.

"అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన... పునరర్ఘ్యం సమర్పయామి"

అని చెబుతూ మోయారోసారి నీటిని భగవంతుని పాదాల క్రింద నదలాలి.

"ఓం బ్రహ్మవినాయకాయ నమః నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన, ఈప్సితంమే వరం దేహి పరత్రచ పరాంగతిమ్.

వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా."

శ్రీ వినాయక చరిత్ర


గమనిక:
వినాయక కథను చదివేవారు మరియు పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి.

గణపతి జననం:

గజముఖుడయిన అసురుడొకడు అతని తపస్సుచే శంకరుడిని మెప్పించాడు. శంకరుడు ప్రత్యక్షం కాగా కోరరాని వరము కోరినాడు. తనను ఎవరూ నధించ జాలని శక్తిని ఇవ్వమని మరియు శివుడు తన ఉదరము నందే నివసించవలెనని కోరినాడు. ఆ విధంగా శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. ఈ విషయాన్ని కైలాసంలో ఉన్న పార్వతీ దేవికి తెలియగా భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీ దేవి విలపించింది. జగత్తుకు శంకరుడు లేని స్థితి ఏర్పడింది. జగన్మాత అయిన పార్వతీ దేవి భర్తను విడిపించు ఉపాయము కొరకు మహా విష్ణువును అర్థించినది.

మహా విష్ణువు గంగిరెద్దు వాని వలే వేషము ధరించినాడు. నందీశ్వరుడిని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళి గజముఖాసురుడిని మెప్పించినాడు. గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అని అన్నాడు. మహా విష్ణువు యొక్క వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు. శివుడిని ఈ నందీశ్వరుని వశము చేయమని అన్నాడు.

గజముఖాసురునికి శ్రీహరి వ్యూహము అర్ధమైనది. తనకు అంత్య కాలము దాపురించినదని గుర్తించి, కుక్షియందు ఉన్న శివుడిని ఉద్దేశించి గజముఖుడు ఇలా అన్నాడు. "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది. నా అనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది' అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు.

నందీశ్వరుడు ఉదరమును దీన్చి శివునికి అందునుండి విముక్తిని కలిగించాడు. శివుడు గజముఖాసురుని శిరస్సును, చర్మమును తీసుకొని స్వస్థలానికి చేరాడు. అక్కడ పార్వతీ దేవి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది.

తనలో తాను ఉల్లనిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో ఆమె కొరకు ఉంచిన నలుగు పిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది. దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయవలెనని దేవికి అనిపించినది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రి అయిన పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది. ఆ దివ్యసుందర బాలుడిని వాకిట కాపలాకు ఉంచి, తన పనులకై లోనికి వెళ్ళింది.

శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతర మందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింపా! అని శివుడు ఆగ్రహించి ఆ బాలుడిని త్రిశూలంతో శిరచ్ఛేదము చేసి లోనికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతీ దేవి విలపించింది. జరిగిన విషయమును పార్వతీ దేవి చెప్పగా శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరస్సును ఆ బాలుని మొండెమునకు అతికించి ప్రాణం పోసినాడు. అలా గజముఖుడి యొక్క శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించినాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దులపట్టి అయినాడు. విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వత స్థానమును పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

గణేశుడు అగ్రపూజనీయుడు:


గణేశుడు అగ్రపూజనీయుడు అనే స్థానాన్ని ఎలా పొందాడు? శివుని యొక్క రెండవ కుమారుడైన కుమారస్వామి అగ్రపూజనీయుడు అన్న స్థానమును కోరినాడు. అప్పుడు శివుడు తన కుమారులు ఇద్దరికీ పోటీ పెట్టినాడు. "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదీ స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికే ఈ ఆధిపత్యము లభిస్తుందని అన్నాడు. కుమారస్వామి వేగముగా ఎంతో సులువుగా తన వాహనమైన నెమలిపై కూర్చొని వెళ్ళాడు. గజాననుడు ఆలోచిస్తూ మిగిలిపోయినాడు. అతని వాహనము మూషికము. అందుపై కూర్చొని ప్రయాణించలేడు. ముల్లోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమును అర్థించినాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, బిలమునిచ్చు నారాయణుని ఆధీనాలు. ఆ మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్ధస్నానమందును కుమార స్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షము కావొచ్చాడు. అలా ముల్లోకములలోని పవిత్ర నదీ స్నానం చేసి వినాయకుడు శివుని వద్దకు కుమార స్వామి కంటే ముందే చేరుకున్నాడు. వినాయకునికే ఆధిపత్యము లభించినది.

చంద్రుని పరిహాసం:

గణేశుడు జ్ఞానస్వరూపుడు, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడు. ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని  వింత రూపమునకు విరగబడి నవ్వాడు.ఫలితముగా లోకమునకు చంద్రుడు సరణీయుడైనాడు. ఆతని మాన్యత నశించింది. నింద్యుడయినాడు. "అతడిపట్ల లోకము విముఖత వహించాలి. అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అతను అజ్ఞానముతో నింద్యుడయినట్లే లోకులు కూడా అజ్ఞానంతో నింద్యులు అవుతారు. నిందలకు గురియగుతారు" అన్న శాపాన్ని పొందాడు. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుడిని చూడకుండా ఎలా ఉండగలరు? నీలాపనిందల మధ్య సవ్యముగా పొగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులను ఈ శాపము నుండి విముక్తికై గణపతిని అర్థించినాడు. కరుణామయుడుగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించినాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు మాత్రమే ఈ శాపపు అన్వయం అవుతుంది. మిగిలిన రోజులు చంద్రుడిని చూసినా సరే అపనిందలు రావు. బాధ్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక (ఎలాంటి తప్పుడు నింద లేని) జీవితము సాధ్యమగునని అనుగ్రహించినాడు.

ఇది ప్రతి ఒక్కరికీ విధియని చెప్పబడినది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడినది. తగదని


చంద్ర దర్శనం నీలాపనింద: (శ్యమంతకమణ్యుపాఖ్యానము)

ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అనునతడు సూర్యోపాసనచే 'శ్యమంతకమను మణిని సంపాదించాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారమును ఈయగల మణి అది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు. అనంతరము సత్రాజిత్తు యొక్క తమ్ముడగు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. అది అతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంస ఖండమని భ్రమించిన సింహం ఒకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని వెళ్లిపోయింది.. నిజము తెలియని సత్రాజిత్తుడు శమంతకమణిని ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు. ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది. అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని మృత దేహము కనిపించింది. ఆ చోటున కనిపించిన సింహపు కాలి జాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము మరియు భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలి జాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి శమంతకమణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుకుంటూ ఒక భల్లూకం అతనిపై పడింది. భీకర సమరం సాగింది. ఒక దినము కాదు, రెండు దినములు కాదు. ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించ సాగింది. అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక ఇంకా భూలోకమునే నిలిచియున్నాడు. అజేయుడు అతడు. ఎవరి వల్లనూ అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనే అని గుర్తించి స్తోత్రము చేయ ఆరంభించాడు.

అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ అవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడు ఈ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము తొలగిపోయినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణితో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ నుండి విముక్తి పొందాడు జాంబవంతుడు. శ్రీకృష్ణుడు మణిని తీసుకొని నగరమునకు వెళ్ళి ప్రజలను పిలిచి జరిగిన యదార్ధమును వివరించి విందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని మరియు తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.


వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై బాధ్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల ఆ నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చాడు. అది మొదలు మనకు శ్యమంతక మణి గాథను వినుట సాంప్రదాయమయినది.

పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు:

"సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః"

సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు ఈ శ్యమంతకము నీదే అను అర్ధము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడింది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడింది.

ఉద్వాసన మంత్రం:

"యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తేహనాకంమహిమా నస్సచంతే యాత్ర పూర్వేసాధ్యాస్పంతిదేవా!!"

సర్వేజనా సుఖినో భవంతు.

వినాయక చవితి పూజ సమాప్తం!

గణపతిని ఆరాధించినటువంటి వారికి అన్ని అడ్డులు తొలిగి విజయం ప్రాప్తిస్తుంది.

శ్రీ మహా గణాధిపతయే నమః

ఓం గం గణపతయే నమః

నీరాజనం…

చివరిగా…
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా

యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తతే |
నేను చేసిన పూజావిధానంలో లోపం ఉన్నా..నా భక్తిలో ఎలాంటి లోపం లేదని అర్థం.
గణపయ్యకు 11 గుంజీలు తీసి మొక్కుకుంటే సకల విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం


విఘ్నేశ్వరుని మంగళహారతులు
శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు- వాసిగల దేవతావంద్యునకును | ఆ సరసవిద్యలకు అదిగురువైనట్టి - భూసురోత్తమ లోకపూజ్యునకును || | జయ మంగళం నిత్య శుభ మంగళం |

నేరేడు మారేడు నెలవంక మామిడి- దూర్వార చెంగల్వ ఉత్తరేణు | వేరువేరుగ దెచ్చి వేడ్కతో పూజింతు - పర్వమున దేవగణపతికి నిపుడు  జయ 

సుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజకొల్తు | శశిజూడరాదన్న జేకొంటి నొక వ్రతము - పర్వమున దేవగణపతికి నిపుడు  జయ 

పానకము వడపప్పు పనస మామిడిపండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు | తేనెతో మాగిన తియ్య మామిడిపండ్లు- మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు  జయ 

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య - ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు | కమ్మని నెయ్యియు కడుముద్దపప్పును - బొజ్జవిరుగగ దినుచు పొరలుకొనుచు  జయ 

వెండిపళ్ళెరములో వెయివేల ముత్యాలు - కొండలుగ నీలములు కలియబోసి | మెండుగను హారములు మెడనిండ వేసికొని - దండిగా నీకిత్తు ధవళారతి  జయ 

పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ | ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తంబున పర్వమున దేవగణపతికి నిపుడు  జయ 

ఏకదంతంబును ఎల్లగజవదనంబు బాగయిన తొండంబు వలపు కడుపు | జోకయున మూషికము సొరిదినెక్కాడుచును - భవ్యుడగు దేవగణపతికి నిపుడు  జయ 

మంగళము మంగళము మార్తాండతేజునకు - మంగళము సర్వజనవందితునకు | మంగళము ముల్లోక మహితసంచారునకు మంగళము దేవగణపతికి నిపుడు  జయ 

సిద్ధివిఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు - ఒనరంగ నిరువదియొక్క పత్రి | దానిమ్మ మరువము దర్భ విష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి | కలువలు మారేడు గన్నేరు జిల్లేడు - దేవకాంచన రేగు దేవదారు | జాజి బలురక్కసి జమ్మిదాచెనపువ్వు - గరిక మాచిపత్రి మంచిమొలక  జయ

అగరు గంధాక్షతల్ ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును | భాద్రపద శుద్ధచవితిని పగటివేళ కుడుములు నానుబాలు ఉండ్రాళ్ళు పప్పు పాయసము జున్ను దేనెను పంక్తిమీర కోరిపూజింతు నిన్నెపుడు కోర్కెలలర  జయ 

బంగారుచెంబుతో గంగోదకముదెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి | మల్లెపువ్వులు దెచ్చి మురహరుని పూజింతు రంగైన నా ప్రాణాలింగమునకు  జయ 

పట్టుచీరలు మంచి పాడిపంటలుగల్గి గట్టిగా కనకములు కరులు హరులు ఇష్టసంపదలిచ్చి యేలినస్వామికి పట్టభద్రుని దేవ గణపతికి నిపుడు  జయ 

ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నే నిల్పి ఎక్కువగు పూజలాలింపజేతు  జయ 

మల్లెలా మొల్లలా మంచిసంపెంగలా చల్లనైనా గంధసారములను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నే జేతు కోరి విఘ్నేశ  జయ 

దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికి నిపుడు  జయ 

చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయ 

మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు నేరేడు నెలవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోను  జయ 

ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలుమీ కరుణతోను మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందుము కోర్కెదీర  జయ 
| జయ మంగళం నిత్య శుభ మంగళం |


విఘ్నేశ్వర దండకము

శ్రీపార్వతీపుత్ర లోకత్రయస్తోత్ర సత్పుణ్యచారిత్ర భద్రేభవక్తా మహాకాయ కాత్యాయనీనాథసంజాత స్వామీ శివా సిద్ధివిఘ్నేశ నీ పాదపద్మంబులన్ నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందుఖండంబు నీ నాల్గుహస్తంబులున్ నీ కరాళంబు నీ పెద్దవక్త్రంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్ సదా మూషకాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్నతొండంబు నీ గుజ్జురూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీగంధమున్ కుంకుమంబక్షతల్ జాజులన్ చంపకంబుల్ తగన్ మల్లెలున్ మొల్లలున్ మంచి చేమంతులున్ తెల్లగన్నేరులున్ మంకెనల్ పొన్నలన్ పువ్వులున్ మంచి దూర్వంబులన్ దెచ్చి శాస్త్రోకరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిన్మంచివౌ నిక్షుఖండంబులున్ రేగుపండ్లప్పడంబుల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోధుమప్పంబులున్ పునుగులున్ బూరెలున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయున్ జున్ను బాలాజ్యమున్ నానుబియ్యంబు నామంబు బిల్వంబు మేల్ బంగరు బళ్ళెమందుంచి నైవేద్యమున్ బంచ నీరాజనంబున్ నమస్కారముల్ జేసి విఘ్నేశ్వరా నిన్ను పూజింపకే యన్యదైవంబులన్ ప్రార్థనల్ సేయుటల్ కాంచనంబొల్లకే యిన్ముదా గోరుచందంబు గాదే మహాదేవ యో భక్తమందార యో సుందరాకార యో భాగ్యగంభీర యో దేవచూడామణీ లోకరక్షామణీ బంధుచింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత, నీ దాసదాసానుదాసుండ శ్రీదొంతరాజాన్వయుండ రామాభిధానుండ నన్నిప్పుడు చేపట్టి సుశ్రేయునిన్ జేసి శ్రీమంతుగా జూచి హృత్పద్మ సింహాసనారూఢతన్నిల్పి కాపాడుటే గాదు నిగ్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగుబంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ పుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ గల్గగా చేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా యివే వందనంబుల్ గణేశా నమస్తే నమస్తే నమస్తే నమః ||

సంతాన గణపతి స్తోత్రం
నమోస్తు గణనాథాయ సిద్ధిబుద్ధియుతాయ చ | సర్వప్రదాయ దేవాయ పుత్రవృద్ధిప్రదాయ న ౧
గురూదరాయ గురచే గోస్తే గుహ్యాసితాయ తే| గోప్పాయ గోపితా శేషభువనాయ చిదాత్మనే  ౨ 
విశ్వమూలాయ ధన్యాయ విశ్వసృష్టికరాయ తే | నమో నమస్తే సత్యాయ సర్వపూర్ణాయ శుండినే  3 
ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమో నమః | ప్రపన్నజనపాలాయ ప్రణతార్తివినాశినే  ౪ 
శరణం భవ దేవేశ సంతతిం సుర్మధా కురు | భవిష్యంతి యే పులా మక్కులే గణనాయక  ౧ 
తే సర్వే తన పూజార్ధం నిరణా! సర్వరోముతః | పురపదమిదం స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకమ్  ౬ 
ఇది సంతానగణపతిస్తోత్రం సంపూర్ణమ్ |

వినాయక చవితి పద్యములు

ప్రార్థన :
 తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.
తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌
అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.

వినాయక మంగళాచరణము:
ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు
 - జయమంగళం నిత్య శుభమంగళం

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి
 - జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు
 - జయమంగళం నిత్య శుభమంగళం

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు
- జయమంగళం నిత్య శుభమంగళం

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను
 - జయమంగళం నిత్య శుభమంగళం.

 

గణపతిని నమ్మకంతో ప్రార్థిస్తే కష్టాలన్నీ దూరం.. వినాయకుడిని పూజిస్తే కలిగే 8 ప్రయోజనాలివే..

వినాయక చవితి..భారత దేశంలో హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఇది కూడా ఒకటి. శివపార్వతుల కుమారుడైన వినాయకుని పుట్టిన రోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతియేటా భాద్రపద మాసం శుక్ల చతుర్థినాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ పండుగనే వినాయక చతుర్థి, గణేశ చతుర్థి అని కూడా పిలుస్తారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు గణేశ విగ్రహాలు ప్రత్యేక పూజలు అందుకుని.. ఆ తర్వాత నిమజ్జనం కోసం ఊరేగింపుగా బయలుదేరుతాయి. విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో కోలాహలంగా నిర్వహిస్తారు.

గ్రామాలు, నగరాల్లోని బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లలో అందరూ కలిసి వినాయక చవితి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్యోద్యమంలో ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తిని రగిలించడంలో వినాయక చవితి మహోత్సవాలు కూడా కీలక పాత్ర పోషించారు. 1892లో దేశ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిలించేందుకు స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య తిలక్.. గణపతి ఉత్సవాలను ప్రారంభించారు.

వినాయకుడు హిందూ మతంలో ఎక్కువగా పూజించే దేవుళ్లలో ఒకరు. ఆయన్ను విఘ్నహర్త అని కూడా అంటారు. అంటే, అడ్డంకులను తొలగించేవాడు అని అర్థం. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజిస్తారు. ఆయన్ని ప్రార్థిస్తే అత్యంత శక్తిమంతమైన ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.

 వినాయకుడిని పూజించడం వల్ల కలిగే 8 లాభాలు ఇక్కడ చూడండి:

గణపతిని జ్ఞానానికి, శ్రేయస్సుకు, విఘ్నాలను తొలగించే దేవుడిగా కొలుస్తారు. నవరాత్రులలో ఆయనను పూజిస్తే జీవితంలోని అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. సంపద, అదృష్టం కలుగుతాయి. ఈ తొమ్మిది రోజులు గణపతిని పూజించడం వల్ల విజ్ఞానం, శాంతి, ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా లభిస్తాయి.

శ్రేయస్సు: ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, శ్రేయస్సుతో కూడిన జీవితాన్ని కోరుకుంటారు. వినాయకుడిని ప్రార్థించడం ద్వారా, మీరు మీ లక్ష్యాలను సాధించడానికి మరింత కృషి చేస్తారు. మీ లక్ష్యాలను చేరుకోవాలనే సంకల్పం పెరుగుతుంది.

అదృష్టం: వినాయకుడు భక్తులకు మంచి అదృష్టం, సంపదలను అనుగ్రహిస్తాడని చెబుతారు. మీరు పూర్తి అంకితభావంతో పూజిస్తే, మీకు కచ్చితంగా అదృష్టం లభిస్తుంది. సంపద, శక్తిని సాధించే మార్గం సులభం అవుతుంది.

జ్ఞానం: గణపతి ఏనుగు తల జ్ఞానానికి ప్రతీక. అందుకే, ఆయనను పూజిస్తే జ్ఞానం లభిస్తుంది. మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అవసరం.

అడ్డంకుల తొలగింపు: వినాయకుడిని విఘ్నహర్త అని పిలుస్తారు. పూర్తి విశ్వాసంతో పూజిస్తే, సరైన మార్గంలో నడవడానికి మార్గనిర్దేశం చేస్తాడు. మీ భయాలను జయించి, అన్ని అడ్డంకులను అధిగమించే ధైర్యాన్ని ఇస్తాడు.

ఓర్పు: గణేశుడి పెద్ద చెవులు ఓర్పుగా వినే లక్షణాన్ని సూచిస్తాయి. ఆయనను ప్రార్థించి, మీ అంతర్గత శక్తిపై దృష్టి పెడితే, మీరు కూడా అదే స్థాయి ఓర్పును అలవర్చుకుంటారు.

విజ్ఞానం: వినాయకుడిని పూజించినప్పుడు, మీరు పరివర్తన మార్గంలో నడవడం ప్రారంభిస్తారు. పట్టుదలతో ప్రయత్నిస్తే, మీరు విజ్ఞాన సోపానాలను అధిరోహిస్తారు.

ఆత్మ శుద్ధి: ఎవరైతే అంకితభావంతో ఆయనను పూజిస్తారో, వారి ఆత్మ శుద్ధి అవుతుందని నమ్ముతారు. క్రమంగా మీ జీవితం నుంచి ప్రతికూలత తొలగిపోయి, మీ ఆత్మ పరిశుభ్రమవుతుంది.

శాంతియుత జీవితం: గణేషుడిని పూజించడం ద్వారా, మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి బాధ్యతగా పనిచేయడం మొదలుపెడతారు. దీనివల్ల మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం శాంతియుతంగా మారుతుంది.


కామెంట్‌లు