తిరుమల వెంకన్న భక్తులకు గొప్ప అవకాశం అని చెప్పాలి.
తిరుపతికి 'వన్ డే' విమాన యాత్ర ప్రకటించిన తెలంగాణ టూరిజం శాఖ
కడలి న్యూస్: తెలంగాణలోని శ్రీవారి భక్తులకు రాష్ట్ర టూరిజం శాఖ గుడ్ న్యూస్ చెబుతూ ఓ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. తిరుపతికి సంబంధించి వన్ డే టూర్ ప్యాకేజీ ప్లాన్ చేసి వివరాలను వెల్లడించింది. ఈ టూర్ ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ. 12,499గా నిర్ణయించారు.
అలాగే టూరిజం శాఖ మరో రెండు రోజుల టూర్ ప్యాకేజీ కూడా అందు బాటులోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.15,499లుగా ఉంది. పూర్తి వివరాలు www.tourism. telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
వన్ డే టూర్ షెడ్యూల్
హైదరాబాద్లో ఉదయం 6.55 గంటలకు ఫ్లయిట్ ఎక్కితే 8 గంటలకు రేణిగుంట.
రేణిగుంట నుంచి కారులో తిరుపతి హోటల్కు, ఫ్రెషప్ అయిన తర్వాత కారులో తిరుపతికి.
మధ్యాహ్నం 1 గంటలోపు తిరుమలలో శ్రీవారి దర్శనం. అనంతరం తిరిగి తిరుపతికి.
గంట విశ్రాంతి తర్వాత తిరుచానూర్ లో పద్మావతి
అమ్మవారిని దర్శనం. అటునుంచి ఎయిర్ పోర్టు.
సాయంత్రం 6.35 గంటలకు రేణిగుంట నుంచి ఫ్లయిట్.. రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్ కు.
తిరుపతి వన్ డే ఫ్లయిట్ టూర్ ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ. 12,499
ప్యాకేజీలో ఫ్లట్ టికెట్, కారు ట్రావెల్ చార్జెస్, రెండుచోట్ల ప్రత్యేక దర్శనాలు.