ది విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంకు సేవలకు110ఏళ్ళు.


2024- 25 ఆర్ధిక సంవత్సరం 71.77 కోట్లు రూపాయల నికర లాభం

*2025-26 ఆర్ధిక సంవత్సరాంతానికి రూ.8,600 కోట్లకు వ్యాపార లక్ష్యం

 కడలి న్యూస్, విశాఖపట్నం: -  2024- 25 ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి పన్నుల అనంతరం 71.77 కోట్లు రూపాయల నికర లాభంతో పాటు, బ్యాంకు కు అన్ని అర్హతలు ఉన్నందున రిజర్వ్ బ్యాంకు ద్వారా షెడ్యూల్డ్ హోదా లభించగలదని పాలకవర్గం విశ్వాసంతో ఉన్నదని ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు తెలియజేశారు. ద్వారకానగర్ లో ఉన్న విశాఖ కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చైర్మన్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలు అనుగుణంగా సహకార బ్యాంకులను ప్రోత్సహించాలని. అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సమాజంలో ఆర్థిక సమానత్వం సాధించడానికి సహకార బ్యాంకులో కృషి చేస్తున్నాయని తెలిపారు. మోసపూరిత ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మోసాలతో అడ్డుకట్టు వేయాలని కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను.సహకార బ్యాంకులను రక్షించాలన్నారు. దేశంలోనే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ గా పేరొందిన విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ కు సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల ఒక సహకార అర్బన్ బ్యాంకుకు షెడ్యూల్ హోదాను రిజర్వ్ బ్యాంకు ఇచ్చినందున 2025-26 ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బ్యాంక్ కు  అన్ని అర్హతలు ఉన్నందున షెడ్యూల్ హోదా లభించగలదని  విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని 1472 అర్బన్ సహకార బ్యాంకులలో 49 బ్యాంకులు షెడ్యూల్డ్ హోదాను పొందగా వాటితో పోల్చుకున్నా, ఆ బ్యాంకులలోని అత్యధిక బ్యాంకులకన్నా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అనేక అంశాలలో మెరుగైన పనితీరును కనబరుస్తున్నదని అన్నారు.అంకితభావం  కలిగిన సిబ్బంది, నిజాయితీపరులైన ఖాతాదారులు ఈ సంస్థ పురోభివృద్ధికి మూలస్థంభాలుగా నిలిచారన్నారు. సిద్ధాంతాలతో రాజీపడకుండా రానున్న కాలంలోనూ వ్యవస్థాపకులు, మార్గదర్శకుల స్ఫూర్తితో ముందుకు సాగేందుకు, నిబద్ధతతో కృషి చేసేందుకు పాలకవర్గం పునరంకితమౌతున్నదన్నారు.

2025-26 ఆర్ధిక సంవత్సరాంతానికి రూ.8,600 కోట్లకు ఆర్ధిక లావాదేవీలు చేర్చడం లక్ష్యంగా ఈ ఏడాది మరో 5 బ్రాంచిలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేయుచున్నదన్నారు. ఈ ఏడాది చివరకు నూజివీడు, తెనాలి, అమలాపురం, హైదరాబాద్, విశాఖపట్నంలలో క్రొత్తగా 5 బ్రాంచిలను ప్రారంభించుకొని బ్రాంచిల సంఖ్య 60 కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు

ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు విశాఖ నగరంలో 1916 ఫిబ్రవరి 5వ తేదిన కార్యకలాపాలను ప్రారంభించి 110వ సంవత్సరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నదన్నారు. బ్యాంకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 51 బ్రాంచిలు మరియు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో 4 బ్రాంచిలు కలిగి ఉండి, మొత్తం 55 బ్రాంచిలతో బహుళ రాష్ట్రాల సహకార అర్బన్ బ్యాంకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నదన్నారు.

దేశంలో ఉన్న నాన్-షెడ్యూల్డ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులలో అతి పెద్ద బ్యాంకుగా ఉన్న  విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్, సహకార సూత్రాలను త్రికరణశుద్ధిగా   పాటించడంలో తన ప్రత్యేకతను చాటుకుంటోందన్నారు. డిపాజిట్టారులను కూడా మెంబర్లు (సభ్యులు)గా చేర్చడం ద్వారా, బ్యాంకు పాలకవర్గ నిర్ణయాలలో వారి భాగస్వామ్యాన్ని కలిగించడం, ప్రతి బ్రాంచీ నందు మహాజన సభలు నిర్వహించి, ఆ సభలలో బ్రాంచికి సంప్రదింపుల కమిటీలను ఎన్నికల ద్వారా ఏర్పాటు చేసి బ్యాంకు దైనందిన కార్యకలాపాలలో వారిని పాత్రదారులను చేయడానికి ప్రయత్నిస్తుంది. అలాగే మొత్తం 55 బ్రాంచిలలో సభ్యుల మహాజనసభలు నిర్వహించడం, తద్వారా బ్యాంకు విధి విధానాలలో అత్యధిక సంఖ్యాక సభ్యులను భాగస్వాములను చేయడం ద్వారా సహకార సూత్రాలలో ప్రధానమైన ప్రజాస్వామిక పని విధానాలతో సహకారసంస్థను నడిపించడంలో తన నిబద్ధతను చాటుకుంటోంది. ఈ ఏడాది మొత్తం 55 బ్రాంచిలలోనూ కలిపి 49 వేలకు పైగా సభ్యులు మహాజనసభలలో పాల్గొనడం ఒక రికార్డు. సహకార బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుగా రూపాంతరం చెందేందుకు రిజర్వుబ్యాంకు అనుమతులు ఇస్తున్నా, సహకార సూత్రాలకు తిలోదకాలు ఇవ్వకుండా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు తనదైన ప్రత్యేక విధానాలతో, బ్యాంకింగ్, సహకార సుత్రాల మధ్య సమతుల్యాన్నిపాటిస్తూ, పురోగమన బాటలో పయనిస్తోందన్నారు.దేశంలోని 1472 అర్బన్ సహకార బ్యాంకులలో 49 బ్యాంకులు షెడ్యూల్డ్ హోదాను పొందగా వాటితో పోల్చుకున్నా, ఆ బ్యాంకులలోని అత్యధిక బ్యాంకులకన్నా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అనేక అంశాలలో మెరుగైన పనితీరును కనబరుస్తున్నదని ఈ క్రింది వివరాలను పరిశీలిస్తే అర్ధమౌతుందని తెలియజేశారు.

2025 మార్చి 31 నాటికి దేశంలోని షెడ్యూల్డ్ అర్బన్ బ్యాంకులలో బ్యాంకు స్థానం షేర్ ధనం మూడో స్థానంలో ఉందన్నారు. రిజర్వులు, మిగులు నిధులు 16, డిపాజిట్లు 15, రుణాలు 14, వడ్డీ ఆదాయం 14, మొత్తం ఆదాయం 14, డిపాజిట్లపై చెల్లించిన వడ్డీ 14, నికర లాభం 10, క్యాపిటల్ టూ రిస్క్ ఎస్సై టు రేషియో 11, కాస్ట్ ఆఫ్ డిపాజిట్ 01, బ్రాంచీలు 55, సభ్యులు1,11,593, షేర్ దనం 339.55 కోట్లు, డిపాజిట్లు 4354.73 కోట్లు, పన్నుల అనంతరం నికర లాభం 71.77 కోట్లు , నిరర్థక ఆస్తులు 0 స్థానాల్లో ఉన్నాయన్నారు.

బ్యాంకు అందిస్తున్న సంక్షేమ పధకాలు

ఆరోగ్య బీమా పధకం ద్వారా సభ్యులకు వైద్య బీమా,మరణించిన సభ్యుల కుటుంబానికి వారి షేరుధనానికి సమానంగా కనిష్టంగా రూ.5,000లు గరిష్టంగా రూ. లక్ష వరకు ఉచిత జీవిత బీమా సౌకర్యం (షరతులకు లోబడి). ఇస్తున్నామన్నారు. ప్రమాదంలో మరణించిన సభ్యుల కుటుంబానికి రూ.50,000ల అదనంగా చెల్లింపు చేస్తున్నామని చెప్పారు.సభ్యుల పిల్లలకు విద్యా పురస్కారాలు,2024-25 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకు అమలు చేస్తున్న పై సంక్షేమ పధకాల ద్వారా 2542 మంది సభ్యులకు అందించిన ఆర్ధిక సహాయం రూ.5.57 కోట్లు ఉందన్నారు. దీనితోపాటు 2024 జూన్ 23న  జరిగిన 109వ వార్షిక మహాజనసభ నిర్ణయం మేరకు రూ.38.80 కోట్లను సభ్యులకు వారి షేరుధనంపై డివిడెండ్గా బ్యాంకు చెల్లించిందన్నారు.ఋణ వాయిదాలు సక్రమంగా చెల్లించిన ఋణగ్రహీతలకు వారు చెల్లించిన వడ్డీలో 4 శాతం రాయితీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ పధకం క్రింద 318 మంది ఋణగ్రహీతలు ఈ ఏడాది రూ.35.31 లక్షలు మేరకు ప్రయోజనం పొందారన్నారు.

1984-85 సం||లో రూ.2.91 కోట్ల కార్యకలాపాలతో ఉన్న బ్యాంకు 2024-25 నాటికి రూ.7791,20 కోట్ల స్థాయికి చేరుకున్నదన్నారు. అలాగే 1984-85 లో 3661 మంది సభ్యులతో రూ. 9 లక్షల షేరుధనం మాత్రమే కలిగిన బ్యాంకు 2024-2025 నాటికి 1,11,593 మంది సభ్యులు, రూ.389.55 కోట్ల షేరుధనంతో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద సహకార అర్బన్ బ్యాంకుగా స్థానం సంపాదించుకుంది. సహకార సూత్రాలు, విలువలకు కట్టుబడి పని చేస్తూ, సమాజంలోని వివిధ వర్గాల అవసరాలకి తగినట్లుగా సేవలు అందిస్తూ ఆయా వర్గాల మన్ననలు అందుకొనుచున్నది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి దాదాపు రూ.7,800 కోట్లకు చేరుకుందన్నారు. బ్యాంకు ఇంచార్జ్ సీఈవో వి.వి.బి.వరలక్ష్మి మాట్లాడుతూ బ్యాంకు భవిష్యత్ ప్రణాళికలలో 2025-26 ఆర్ధిక సంవత్సరాంతానికి రూ.8,600 కోట్లకు ఆర్ధిక లావాదేవీలు చేర్చే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ ఏడాది మరో 5 బ్రాంచిలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది చివరకు నూజివీడు, తెనాలి, అమలాపురం, హైదరాబాద్ మరియు విశాఖపట్నంలలో క్రొత్తగా 5 బ్రాంచిలను ప్రారంభించుకొని బ్రాంచిల సంఖ్య 60కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. నాటి వ్యవస్థాపకుల నుండి ప్రస్తుత పాలకవర్గం వరకు నిబద్ధతతో, సహకార సూత్రాలకు కట్టుబడి పని చెయ్యడమే ఈ సంస్థ పురోభివృద్ధికి బాటలు వేసిందన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు బ్యాంకులపై ప్రజల విశ్వాసాన్ని సృతీస్తున్న దశలోనూ పాలకవర్గం చేపడుతున్న చర్యలు ప్రజలలో నమ్మకాన్ని పెంచగలుగుతున్నాయన్నారు .బ్యాంకు అందిస్తున్న సేవలలో ప్రత్యేకతలు ఆమె తెలియజేస్తూ రోజువారీ నిల్వలపై త్రైమాసిక లెక్కింపు ప్రాతిపదికన సేవింగ్స్ బ్యాంకు ఖాతాలపై 4 శాతం వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకు గా నిలిచిందన్నారు. ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు జె.వి సత్యనారాయణమూర్తి, అప్పారి జోసఫ్ స్టాలిన్, సూర్య నేని నాగభూషణ్ చౌదరి, పొట్లూరు వెంకట్రావు, ఉప్పలపాటి పార్వతీదేవి, పీవీ నరసింహా మూర్తి,  ఈమని ఆవని, ప్రొఫెసర్ నన్నపనేని అంజయ్య, డాక్టర్ రామ్మూర్తి వైద్యనాథన్, దొండపూడి బాబురావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు