కడలి న్యూస్, విశాఖపట్నం:– విశాఖ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కు రామానాయుడు స్టూడియో దగ్గర ప్రభుత్వం కేటాయించిన అయిదెకరాల భూమి లీజు కాలాన్ని ఖరారు చేయాల్సిందిగా ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లినట్టు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. తిమ్మాపురంలోని కల్చరల్ సెంటర్ లో కమిటీ సభ్యులతో ఆదివారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కోసం 2014 - 2019 లో టీడీపీ ప్రభుత్వం భూమిని కేటాయించిందని, లీజు నిమిత్తం రూ. 22 లక్షలు చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే లీజు కాలాన్ని ఆ ఉత్తర్వుల్లో ప్రస్తావించకపోవడంతో జాప్యం చోటు చేసుకుందని వివరించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని కనీసం పట్టించుకోలేదన్నారు. సముద్ర తీరాన కేటాయించిన స్థలంలో విశాఖ పేరు, ప్రతిష్టలు ఇనుమడింపజేసేలా అధునాతన కల్చరల్ సెంటర్ నిర్మించాలని సూచించారు. ఇప్పటికే సిద్ధం చేసిన భవనాల డిజైన్లను గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. కన్వెన్షన్ సెంటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్, రూంలు, స్పోర్ట్స్ ఎరీనా, బ్యాంకెట్ హాల్స్, స్విమ్మింగ్ పూల్ వంటి ఆధునిక సౌకర్యాలతో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ సభ్యులకు సూచించారు. పక్కనే రూ. 172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మించనున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి ఒక ల్యాండ్ మార్క్ గా గుర్తింపు రానుందన్నారు. కల్చరల్ సెంటర్ భవన నమూనా ఆకర్షణీయంగా ఉండేలా డిజైన్ చేయించాలని చెప్పారు. ఫిల్మ్ నగర్ సెంటర్ కు భూ కేటాయింపు అనేది సభ్యుల పదేళ్ల కలగా ఆయన పేర్కొన్నారు. వాల్తేర్ క్లబ్, గోల్ఫ్ క్లబ్ మాదిరిగా అత్యాధునిక హంగులతో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ను నిర్మించాలని పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ క్లబ్ లలో అమలవుతున్న ఉత్తమ నియమావళిని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో అమలు చేయడం ద్వారా మోడల్ క్లబ్ గా తీర్చి దిద్దాలని చెప్పారు. కల్చరల్ సెంటర్ లో నిర్మాణానికి తగినన్ని నిధులు ఉన్నందున, లీజు కాలం నిర్ధారణ తర్వాత భూమి పూజ చేసి వేగంగా నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి కలుగుతుందని, టూరిజం అభివృద్ధికి ఊతంగా ఉంటుందని తెలిపారు. అనంతరం కల్చరల్ సెంటర్ లో సౌకర్యాలను గంటా పరిశీలించారు. ఆదాయ వనరులను పెంచుకోవాలని, సభ్యులకు నాణ్యమైన సేవలు అందించాలని కమిటీ సభ్యులకు చెప్పారు. సమావేశంలో అధ్యక్షుడు ఆర్.వి. చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను), కోశాధికారి కె. బాలాజీ శివప్రసాద్, సభ్యులు ఎ.ఎల్.ఎన్. రాజు, కంటిపూడి వెంకటేశ్వరరావు, శ్రీధర్ రాజు, జాస్తి శ్రీకాంత్ పాల్గొన్నారు.
విశాఖలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ నిర్మాణానికి త్వరలో భూమి పూజ
కడలి న్యూస్, విశాఖపట్నం:– విశాఖ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కు రామానాయుడు స్టూడియో దగ్గర ప్రభుత్వం కేటాయించిన అయిదెకరాల భూమి లీజు కాలాన్ని ఖరారు చేయాల్సిందిగా ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లినట్టు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. తిమ్మాపురంలోని కల్చరల్ సెంటర్ లో కమిటీ సభ్యులతో ఆదివారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కోసం 2014 - 2019 లో టీడీపీ ప్రభుత్వం భూమిని కేటాయించిందని, లీజు నిమిత్తం రూ. 22 లక్షలు చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే లీజు కాలాన్ని ఆ ఉత్తర్వుల్లో ప్రస్తావించకపోవడంతో జాప్యం చోటు చేసుకుందని వివరించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని కనీసం పట్టించుకోలేదన్నారు. సముద్ర తీరాన కేటాయించిన స్థలంలో విశాఖ పేరు, ప్రతిష్టలు ఇనుమడింపజేసేలా అధునాతన కల్చరల్ సెంటర్ నిర్మించాలని సూచించారు. ఇప్పటికే సిద్ధం చేసిన భవనాల డిజైన్లను గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. కన్వెన్షన్ సెంటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్, రూంలు, స్పోర్ట్స్ ఎరీనా, బ్యాంకెట్ హాల్స్, స్విమ్మింగ్ పూల్ వంటి ఆధునిక సౌకర్యాలతో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ సభ్యులకు సూచించారు. పక్కనే రూ. 172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మించనున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి ఒక ల్యాండ్ మార్క్ గా గుర్తింపు రానుందన్నారు. కల్చరల్ సెంటర్ భవన నమూనా ఆకర్షణీయంగా ఉండేలా డిజైన్ చేయించాలని చెప్పారు. ఫిల్మ్ నగర్ సెంటర్ కు భూ కేటాయింపు అనేది సభ్యుల పదేళ్ల కలగా ఆయన పేర్కొన్నారు. వాల్తేర్ క్లబ్, గోల్ఫ్ క్లబ్ మాదిరిగా అత్యాధునిక హంగులతో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ను నిర్మించాలని పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ క్లబ్ లలో అమలవుతున్న ఉత్తమ నియమావళిని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో అమలు చేయడం ద్వారా మోడల్ క్లబ్ గా తీర్చి దిద్దాలని చెప్పారు. కల్చరల్ సెంటర్ లో నిర్మాణానికి తగినన్ని నిధులు ఉన్నందున, లీజు కాలం నిర్ధారణ తర్వాత భూమి పూజ చేసి వేగంగా నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి కలుగుతుందని, టూరిజం అభివృద్ధికి ఊతంగా ఉంటుందని తెలిపారు. అనంతరం కల్చరల్ సెంటర్ లో సౌకర్యాలను గంటా పరిశీలించారు. ఆదాయ వనరులను పెంచుకోవాలని, సభ్యులకు నాణ్యమైన సేవలు అందించాలని కమిటీ సభ్యులకు చెప్పారు. సమావేశంలో అధ్యక్షుడు ఆర్.వి. చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను), కోశాధికారి కె. బాలాజీ శివప్రసాద్, సభ్యులు ఎ.ఎల్.ఎన్. రాజు, కంటిపూడి వెంకటేశ్వరరావు, శ్రీధర్ రాజు, జాస్తి శ్రీకాంత్ పాల్గొన్నారు.