కడలి న్యూస్:– చక్రవర్తి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని, మరాఠా సామ్రాజ్యాన్ని బలపరచిన గొప్ప యోధుడు ఛత్రపతి శంభాజీ. ఈరోజు ఆయన జయంతి. 1657 మే 14న పుణేలోని పురందర్ కోటలో జన్మించిన శంభాజీ, తండ్రి నుంచి వచ్చిన స్వాతంత్య్ర స్ఫూర్తిని తుదిశ్వాస వరకు నిలబెట్టారు. ఔరంగజేబు అత్యంత క్రూరంగా హింసించినా ఏమాత్రం బెదరకుండా మరాఠా ధీరత్వాన్ని చాటి వీర మరణం పొందారు. కాగా ఆయన జీవితంపై 'ఛావా' సినిమా తెరకెక్కింది.