కడలి న్యూస్, విశాఖపట్నం :– ఏపీ టౌన్ ప్లానింగ్ టెక్నికల్ అధికారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, జీవీఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్ కె వెంకటేశ్వరరావు సారధ్యంలో సోమవారం జీవీఎంసీ కార్యాలయంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ , జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ కె ప్రభాకర్ రావు, అదనపు కమిషనర్ డివి రమణమూర్తి , మరో డిప్యూటీ సిటీ ప్లానర్ టీ జి రామ్మోహన్ రావు అసోసియేషన్ సభ్యులు తేజేశ్వరరావు లు టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ డైరీ ని, క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల కృషిని కొనియాడారు. పట్టణాల సుందరీ కరణ కు, ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చెందేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తున్న కృషిని కమిషనర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రణాళికాయుతంగా భవనాలకు అనుమతుల నిస్తూ విశాఖ నగర అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు
