విశాఖలో మాయ ప్రపంచం.. దేశంలోనే మొదటిది



కడలి న్యూస్, విశాఖపట్నం:–
దేశంలోనే మొదటిసారిగా విశాఖలో మాయ వరల్డ్ ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయటం అభినదనీయమని విఎంఆర్డిఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్  పేర్కొన్నారు. విశాఖ సాగర తీరంలో  TU 142 ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన మాయా వరల్డ్ ను ప్రణవ్ గోపాల్  ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాయా వరల్డ్ ను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మాయా వరల్డ్ నగర వాసులతో పాటు పర్యాటకులను మరింత  ఆకట్టుకునేలా ఉందని తెలిపారు.  ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన "ఇమాజిన్ రూమ్స్" తరహాలో రూపొందించిన ఈ మ్యూజియం, కళ్లకు కనువిందు చేసే లైటింగ్, అద్దాల ప్రతిబింబాలతో అద్భుత అనుభూతిని కలిగిస్తోందనీ తెలిపారు. మ్యూజియంలో మిరర్ రూమ్స్, స్పేస్ గెలాక్సీ థీమ్, ఫ్లవర్ గార్డెన్ థీమ్, డ్రీమ్ స్కేప్, మెజికల్ ఫారెస్ట్ లాంటి ప్రత్యేక కాన్సెప్ట్‌లతో ఏర్పటు చేసిన గదుల్లో సంచరిస్తే వింత అనుభూతి లభిస్తుందని చెప్పారు.  ఫోటో షూట్లకు, రీల్స్‌ తీయడానికి ఇది సరిగ్గా సరిపోయే ప్రదేశమని చెప్పారు. సెల్ఫీలకు, వీడియోలకు అనువైన ప్రాంతంగా పేర్కొన్నారు.  కార్యక్రమంలో జాయింట్ కమిషనర్  కె రమేశ్, ఈ ఈ దుర్గా ప్రసాద్, డి ఈ మూర్తి, మాయా వరల్డ్ నిర్వాహకులు కెప్టెన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు