ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి హాజరు లో విశాఖ సాగర తీరంలో యోగాంధ్ర కార్యక్రమం.
కడలి న్యూస్, అనకాపల్లి జిల్లా, ఈ నెల 21న విశాఖపట్నం సాగర తీరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న *“యోగాంధ్ర”* కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్నారు. భారీ స్థాయిలో జరుగనున్న ఈ కార్యక్రమానికి అనేక జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. అనకాపల్లి జిల్లా 24 మండలాల నుంచి విశాఖ, పీఎం పాలెం, ఎన్.వి.పి లా కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన 37 కంపార్టుమెంట్లలో ప్రజలు యోగాంధ్రకు బస్సుల ద్వారా చేరుకోనున్నారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు, బస్సులు కింది మార్గాల్లో ప్రయాణించాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ తెలిపారు.
రూట్ - 1:
మండలాలు:
అనకాపల్లి, వి.మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, చోడవరం, దేవరపల్లి, బుచ్చయ్యపేట, రోలుగుంట, రావికమతం, సబ్బవరం మండలాలకు చెందిన బస్సుల ప్రయాణ మార్గం:
చిన్నయ్యపాలెం జంక్షన్ → సబ్బవరం → పెందుర్తి → గండిగుండం → శోంట్యాం అండర్ బ్రిడ్జి → అడవివరం → హనుమంతవాక → లా కాలేజ్ → ఐటి సెజ్ దారిలో ప్రయాణించాలి.
రూట్ - 2:
మండలాలు:
పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, ఎలమంచిలి, కసింకోట, మునగపాక, కోటవురట్ల, నర్సీపట్నం, మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం మండలాలకు చెందిన బస్సుల
ప్రయాణ మార్గం:
నేషనల్ హైవే → తాళ్లపాలెం జంక్షన్ → కసింకోట → జలగల మధుం → సబ్బవరం → పెందుర్తి → గండిగుండం → శోంట్యాం అండర్ బ్రిడ్జి → అడవివరం → హనుమంతవాక → లా కాలేజ్ → ఐటి సెజ్
రూట్ - 3:
మండలాలు:
రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ మండలాల ఇండస్ట్రియల్ & విద్యార్థుల బస్సులు
ప్రయాణ మార్గం:
లంకెలపాలెం → గాజువాక → ఎన్ఏడి → గోపాలపట్నం → సింహాచలం → అడవివరం → హనుమంతవాక → లా కాలేజ్ → ఐటి సెజ్ (మరియు స్టీల్ ప్లాంట్, కూర్మన్నపాలెం, గాజువాక)
ట్రాఫిక్ పరిమితులు:
పాయకరావుపేట నుండి విశాఖ దిశగా వెళ్లే భారీ వాహనాలు:
జూన్ 20 సాయంత్రం 6 గంటల నుంచి నిలిపివేయబడతాయి.సాధారణ వాహనాలు మరియు అత్యవసర వాహనాలు పాయకరావుపేట నుండి నేషనల్ హైవే మీదుగా ఆనందపురం వైపు మళ్లించబడతాయి. అత్యవసర వాహనాలకు ప్రయాణానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించబడుతుంది. కంపెనీలకు చెందిన బస్సులు 20వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి నిలిపివేయబడతాయి. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు మాట్లాడుతూ ట్రాఫిక్ రద్దీ లేకుండా యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరుగేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది పటిష్ఠంగా బందోబస్తు నిర్వహించాలి. 37 కంపార్టుమెంట్లలో ప్రజలు సురక్షితంగా చేరేలా చూడాలి. బస్సులను కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోకి సజావుగా నడిపేందుకు ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలి. ట్రాఫిక్ నియంత్రణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండాలి,” అని అన్నారు. ఇటు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు సంబంధించిన 48 బస్సులు కూడా ఈ రూట్లలోనే ప్రయాణించాలన్నారు.