తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త


 ఈనెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

  కడలి న్యూస్, తిరుపతి:-  శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను మే 19న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈనెల 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే జులై నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ టికెట్లను మే 29న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది.

కామెంట్‌లు